శ్రీ కృష్ణదేవరాయ
తెలుగు భాషా నిలయం

తెలుగు వైభవానికి నిలయం, భాషాభిమానులకు ఆలయం

మా గురించి

తెలుగు జ్ఞాన కేంద్రం

సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, నిజాం రాష్ట్రంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా ఆవిర్భవించి, తెలుగు జాతి చైతన్యానికి, భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి మరియు సాంస్కృతిక వైభవానికి 123 సంవత్సరాలకు పైగా నిరంతర సేవలందిస్తూ వెలుగొందుతోంది. తెలుగు సంస్కృతి, సాహిత్య సంప్రదాయాలకు శిఖరప్రతిష్ఠగా నిలిచిన ఈ మహోన్నత సంస్థ, తెలుగు వైభవానికి నిలయం, భాషాభిమానులకు ఆలయంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూ విశిష్ట ఖ్యాతిని సంతరించుకుంది

1901 సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, నిజాం రాష్ట్రంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా ఆవిర్భవించి, తెలుగు జాతి చైతన్యానికి, భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి మరియు సాంస్కృతిక వైభవానికి 123 సంవత్సరాలకు పైగా నిరంతర సేవలందిస్తూ వెలుగొందుతోంది. తెలుగు సంస్కృతి, సాహిత్య సంప్రదాయాలకు శిఖరప్రతిష్ఠగా నిలిచిన ఈ మహోన్నత సంస్థ, తెలుగు వైభవానికి నిలయం, భాషాభిమానులకు ఆలయంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూ విశిష్ట ఖ్యాతిని సంతరించుకుంది

అరుదైన గ్రంథాలు, తాళపత్ర వ్రాతప్రతులు, పురాతన పత్రికలతో నిండిన ఈ నిలయం తెలుగు వారసత్వానికి సజీవ సాక్ష్యం.

సాంస్కృతిక కార్యక్రమాలు

తెలుగు భాష, సాహిత్యం, కళలను పెంపొందించే వార్షిక కార్యక్రమాలు

సాహిత్య సభలు

కవి సమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు నిరంతరం జరుగుతాయి.

విద్యార్థి కార్యక్రమాలు

వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పఠన అలవాట్లను పెంచే కార్యశాలలు.

సాంస్కృతిక ఉత్సవాలు

తెలుగు పండుగలు, జయంతులు, స్మారక సభలను ఘనంగా నిర్వహిస్తాం.

125వ వార్షికోత్సవం

శతాబ్దిన్నర ప్రస్థానం — ఒక ఉజ్వల వేడుక

సెప్టెంబరు 1, 1901 సంవత్సరంలో (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ ఆదివారం) వెలిగిన జ్ఞానదీపం నేటికీ ప్రకాశిస్తోంది. 125 సంవత్సరాల ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక వేడుకలను నిర్వహిస్తున్నాం. ఈ వారసత్వ ప్రయాణంలో మీరూ భాగం కావండి.

125

సంవత్సరాల సేవ

1901

స్థాపన సంవత్సరం

🏛️ సాంస్కృతిక కార్యక్రమాలు

సంవత్సరోత్సవాలు:
రజతోత్సవాలు (1927) స్వర్ణోత్సవాలు (1952) వజ్రోత్సవాలు (1962) అమృతోత్సవాలు (1977) శతాబ్ది ఉత్సవాలు (2002) సమగ్ర శతాబ్ది ఉత్సవాలు (2026)

జయంతి ఉత్సవాలు & పురస్కారాలు:

  • బూర్గుల రామకృష్ణారావు జయంతి: ప్రతిభా పురస్కారం
  • దాశరథి జయంతి: కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
  • రావిచెట్టు రంగారావు జయంతి: తెలుగు భాషా వికాస పురస్కారం
  • పి.వి. నరసింహారావు జయంతి: స్మారక పురస్కారం

📜 125 సంవత్సరాల వారసత్వం

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం (పూర్వనామం: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం) 1901 సెప్టెంబర్ 1న స్థాపించబడిన తెలంగాణలోని మొట్టమొదటి గ్రంథాలయం.

నేటి అమూల్య సంపద 🔗
సుమారు 50,000కు పైగా అరుదైన గ్రంథాలు, తాళపత్ర ప్రతులు, పాత పత్రికలు మరియు చారిత్రక దస్తావేజులు.

✍️ రచనల ఆహ్వానం

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వారి 125వ వార్షికోత్సవం (సమగ్ర శతాబ్ది ఉత్సవాలు) సందర్భంగా వెలువడనున్న ప్రత్యేక సంకలనానికి “నాకు నచ్చిన నా తెలుగు” అనే అంశంపై రచనలు ఆహ్వానిస్తున్నాము.

📅 చివరి తేదీ: 2026 ఆగస్టు 15
📧 ఇ-మెయిల్: sktbn.org@gmail.com

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి 🔗

మా దృష్టి (Our Vision)

తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేయడం, ఆధునిక సాంకేతికత & డిజిటలైజేషన్ ద్వారా నవతరానికి భాషా విలువలను చేరవేయడం.

👥 ప్రస్తుత కార్యవర్గం

అధ్యక్షులు: డాll కె. వి. రమణాచారి IAS (రి)
ఉపాధ్యక్షులు: కె. చంద్రప్రకాశ రావు
గౌరవ కార్యదర్శి: టి. ఉదయవర్లు
సంయుక్త కార్యదర్శి: డాll గంగు నరసింహ మూర్తి
కోశాధికారి: కె. జగదీశ్వర రావు
సలహాదారు: డాll ఎస్. సుదర్శన్ రావు

కార్యవర్గ సభ్యులు: యం. శ్రీనివాస రావు, నూతి శంకర రావు, ఆర్. మాధవ రావు, ఎ.వి. జనార్ధన రావు

ఇంకా తెలుసుకోండి →

✨ 125వ వసంతోత్సవం

ఈ చారిత్రక గ్రంథాలయం 2025 సెప్టెంబరు 1 నాటికి 125వ వసంతంలోకి (Supercentenary) అడుగుపెట్టింది. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ ప్రక్రియను (Digital Library Initiative) వేగవంతం చేస్తూ సరికొత్త పుటలను లిఖిస్తోంది.

వివరాలు చూడండి →

🤝 విరాళాలు

సంస్థకు ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 80G కింద మినహాయింపు పొందుతాయి.

PAN: AAPAS5745N

విరాళం ఇవ్వండి →